టీవీ5 సురేష్ కుటుంబానికి అండగా ఉంటాం పూర్వ విద్యార్థులు
ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలం తెలంగాణ పవర్ డిసెంబర్ 15 పదవ తరగతి పూర్వ విద్యార్థి,మిత్రుడు టీవీ5 జర్నలిస్ట్ కీర్తిశేషులు బొడ్డు సురేష్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఇసంపల్లి రమేష్ వారి తోటి మిత్రులు అన్నారు.ధర్మసాగర్ మండల కేంద్రంలోని 1992-93 పదోవ తరగతి బ్యాచ్ కి చెందిన టీవీ5 జర్నలిస్టు బొడ్డు సురేష్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.గురువారం విద్యార్థులు అందరూ కలిసి 50 వేల రూపాయలు వారి కుటుంబానికి ఎస్బిఐ బ్యాంకులో ఫిక్స్డి పాజిట్ చేసిన బాండును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటోతరగతి నుండి పదవ తరగతి వరకు మాలో ఒకడిగా ఉండి గత నెల ముందు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకర మన్నారు.తను లేని లోటును ఎవరు కూడా పూడ్చలేరని,వారికి కుటుంబానికి 50వేల రూపాయలను మిత్రుల సహకారంతో పోగుచేసి.వారి సలహా మేరకు ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆర్థిక పరమైన ఆపదలో తోడు ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కార్యక్రమంలో ధర్మసాగర్ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్,సాయి పేట గ్రామసర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్, చట్ల రమే ష్,అంకం రాజా రామన్,నాగవెల్లి యుగంధర్,సురుగురు శ్రీనివాస్,బొల్లం రాజబాబు,నల్లగొండ రవి,కోట్టి లెనిన్ సుధాకర్, గొర్రె మోహన్,దువ్వవెంకట్రాజ్యం,కొలిపాక రవీం దర్,మేడారపు రవి,కోమాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.