రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం ఏడుగురి అరెస్టు
హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్లో మాదకద్రవ్యాలు కలకలం సృష్టించాయి.ఈ నెల 21 నిర్వహించిన ఆపరేషన్లో సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు.అంతేకాకుండా మెఫిడ్రిన్ తయారుచేసే 2 ల్యాబ్లను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం తెలిపింది.ఈ కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారిని గోరఖ్పూర్లో పట్టుకున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది.రూ.60 లక్షలతో నేపాల్ పారిపోయేందుకు యత్నిస్తున్న సమయంలో అతడిని పట్టుకున్నట్లు తెలిపింది.అరెస్టు చేసిన ఏడుగురిలో పలువురికి ఇండోర్,యమునా నగర్లో మెఫిడ్రిన్ తయారు చేస్తున్న వ్యవహారంలో 2016,2022 జులైలో నమోదైన కేసులతోపాటు,ఇండోర్ జైలు నుంచి తప్పించుకున్న కేసులో హైదరాబాద్లో నమోదైన ఓ హత్య కేసుతో,వడోదర దోపిడీలతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.