ప్రధానమంత్రి మోడీ సోదరుడి కారు ఢీ కొట్టడంతో ప్రమాదనికి గురైంది
మైసూరు : ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ప్రహ్లాద్ మోడితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.విరందరిని మైసూరులో ఎస్జె అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బందిపుర వెళ్తుండగా మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో కారులో ప్రహ్లాద్ మోడీ తో పాటు అయన భార్య,కొడుకు,కోడలు,మనుమడు ఉన్నారు.ప్రమాదంలో కారులో ఉన్న అందరికి స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ ప్రమాదంలో ముందు భాగం ధ్వంసమైంది సమాచారం అందుకున్న మైసూరు ఎస్పీ సీమా లాట్క ర్ అస్పత్రికి వెళ్లారు.