మద్దిశెట్టి సామేలు గారి చేతుల మీదుగా నియామక పత్రం
హైదరాబాద్ : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎండీ.ఫయాజ్,హైదరాబాద్ సిటీ కన్వీనర్ గా ఎండీ అస్లామ్.రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరావు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని తీసుకోవడం జరిగింది.అదే విధంగా ఎండీ. అస్లామ్ గారిని హైదరాబాద్ సిటీ కన్వీనర్ గారిని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బానోత్ రవి తదితరులు పాల్గొన్నారు.
చించీన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్థాపించిన ఆర్పీఐ పార్టీ, ప్రస్తుతం 25 ఏళ్లుగా జాతీయ అధ్యక్షులుగా ఉన్న కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే గారు క్రిస్మస్, నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన ఫ్లెక్సిని కొంతమంది అగ్రవర్ణ కులానికి చెందిన వారు ఫ్లెక్సీనీ చించివేయాడం జరిగింది.ఈ విషయం పై కొంత మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ చించీన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ విషయం మీద కేంద్రమంత్రి రాందాస్ అతవాలే గారి ఆదేశాల మేరకు ఆర్పీఐ పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నాము తెలిపారు.