ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సెక్రెటరీని కలిసిన మద్దిశెట్టి
ఖమ్మం : కుకునురు మండలం పెద్దరాయగూడెం పంచాయితీ బరపటినగర్ గ్రామానికి చెందిన 35 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు కులం సర్టిఫికెట్లు,పోడు భూమి మీద హక్కులు,మంచినీటి సదుపాయం పలు మౌలిక సదుపాయాలు కల్పించాలి.గౌరవ లోకాయుక్త కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఈ రోజు అమరావతి కో-ఎస్టీ కమిషన్ సెక్రెటరీ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు.స్పందించిన సెక్రెటరీ జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొడే నాగేష్,ఏపీ బీసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు గారిపై దాడులు ఆపాలి
మద్దిశెట్టి సామేలు గారిపై దాడులు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం.04.01.2023 న అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నాం.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ రాందాస్ అతవాలే గారి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనీ కొంత మంది అధికార పార్టీ వ్యక్తులు చించివేసి సత్తుపల్లి మండల అధ్యక్షులు కూరం మహేంద్ర పై దాడి చేయాలనే ప్రయత్నం చేశారు.అదే విధంగా మా నాయకుడు అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారిని చంపుతామని బెదిరిస్తున్నారు.ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ తేదీ 04.03.2023 న ఖమ్మం,మహబూబాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబందించి అన్ని మండలాల్లో మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలు స్థానిక ఎమ్మర్వోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నాను.ఈ నెల 31 వ తేదీన జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరి 4 వ తేదీన మార్చబడింది.