బీజేపీ ఆటలు సాగవు...మునుపెన్నడూలేని విధంగా మారుస్తా
* ప్రతి గ్రామాన్ని మునుపెన్నడూలేని విధంగా మారుస్తా ఎమ్మెల్యే
* మునుపెన్నడూలేని విధంగా మారుతున్న తాండూరు రూపురేఖలు
* పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు కోసం ఎండీతో మాట్లాడిన ఎమ్మెల్యే
* ప్రతీ గ్రామానికి రూ.50 లక్షల నిధులివ్వడం తాండూరు చరిత్రలోనే రికార్డ్
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు : పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాంగంగా గురువారం నాలుగోరోజు బషీరాబాద్ మండలంలోని ఇస్మాయిల్ పూర్, నీళ్లపల్లి, నీళ్లపల్లితండా, జలాల్ పూర్, జలాల్ పూర్ తండా, మర్పల్లి, పర్వత్ పల్లి, హంఖ్యానాయక్ తండా,బాబునాయక్ తండా,భోజ్యానాయక్ తండా,నవాల్గ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో చరిత్రలోనే మునుపెన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు కేటాయించారని తెలిపారు.తాండూరులో ఎంతో మంది దిగ్గజ నాయకులు పరిపాలన చేశారు కానీ ఇంత భారీగా నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవన్నారు.తండాలు,గ్రామాలు అని తేడా లేకుండా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.బీజేపీ డ్రామా కంపెనీ పనైపోయిందన్నారు.పర్యటనలో భాగంగా ప్రజా సమస్యలను అడిగితెలుసుకొని, అభివృద్ధి పనులను గ్రామస్థులకు వివరించారు.
డప్పులతో స్వాగతం పలుకుతున్న జలాల్ పూర్ గ్రామస్థులు
సీఎం కేసీఆర్ కృషితో తాండూరు అభివృద్ధి చెందుతుందని.అలాగే ప్రతి గ్రామం,రూపు రేఖలు మారుతున్నాయన్నారు.గ్రామాల్లో ఆర్టీసీ బస్సుల కొరత ఉందని తెలుపగా అప్పటికప్పుడు ఎండీతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.నీళ్లపల్లిలో కొంతమందికి పించన్లు రావడంలేదని తెలుపగా ఎమ్మార్వోతో మాట్లాడారు.ఎంతో ఓపికగా ప్రజల సమస్యల్ని వింటూ పరిష్కారం చూపుతానని తెలిపారు.మరికొన్ని గ్రామాల్లో స్లైడ్ డ్రైన్లు,సీసీ రోడ్లు,ఫార్మేషన్ రోడ్లు,స్కూల్ బెంచీలు,డ్వాక్రా భవనం,కావాలని వినతులు రాగా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మీ ఆశీర్వాదం ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా,నా పైనా ఉండాలన్నారు.తప్పకుండా తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.