బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యలు పరిష్కరించాలి
- తురక నరసింహ గారిని కలిసిన BSSM టీమ్
కొత్తగూడెం : కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దక్షిణ భారతదేశ అభివృద్ధి సంక్షేమ బోర్డ్ మెంబర్ శ్రీ తురక నరసింహ గారిని హైదరాబాద్ లోని వారి ఆఫీస్ లో కలిసి ఇల్లందు, టేకులపల్లి లోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యలు పరిష్కరించే విషయంలో రివ్యూ మీటింగ్ రావాలని కోరడం జరిగింది.స్పందించిన నరసింహ గారు జనవరి మొదటి లేదా రెండో వారంలో రివ్యూ మీటింగ్ వస్తానని, అక్కడున్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వర్శ వెంకన్న,జిల్లా కార్యదర్శి యట్టి శ్రీరాములు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి, కూసుమంచి మండల అధ్యక్షులు బాణోత్ రవి,ఇల్లందు మండల అధ్యక్షులు ఈసం రవి,జిల్లా నాయకులు కిన్నెర రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.