తాండూర్ అంబేద్కర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ
తాండూర్ : తాండూర్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పొలీస్ ఈవెంట్ లో చనిపోయిన అభ్యర్థులకు నివాలులు అర్పించి వారి మృతికి పరోక్షంగా కారణమైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన వైఖరి కారణమేనన్న విషయాన్ని నిరసిస్తూ వారికి న్యాయం చేయాలని ఇంటికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పి.అరుణ్ రాజ్,తాండూర్ నియోజకవర్గం బిట్ సెల్ ఇంచార్జ్ ఎం.జైరామ్,తాండూర్ మండల కన్వీనర్ ఎం.చెన్నప్ప,పెద్దేముల్ మండల కన్వీనర్ రమేశ్,మైనారిటీ నాయకులు సల్మాన్,రఫి,తదిపరులు పాల్గొన్నారు.