బషీరాబాద్ లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- క్రిస్మస్ అంటే సమాధానం కల్గి ఉండాలి
- క్రిస్మస్ వేడుకల్లో వివిధ గ్రామాల్లో పాల్గొన్న ఎం శ్రీనివాస్
బషీరాబాద్ : తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో ఏకమై,బషీరాబాద్ మండల పరిధిలో,జీవన్గీ, నవల్గా,అల్లంపూర్ దామర్ చెడు గ్రామాలలో క్రైస్తవులు యేసు క్రీస్తు దేవుడు పుట్టిన రోజు సంధర్బంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.పాస్టర్లు చంద్ర మౌళి,దినకరన్,శ్రీశైలం,శామ్యూల్,నెహేమ్యే,జోసెఫ్ పలు సంఘ కాపరులు యేసు క్రీస్తు ఎలా పుట్టాడు,ఎందుకు పుట్టాడు,ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని క్లుప్తంగా వివరించారు.చిన్నపిల్లలు అట పాటలు నృతలతో దేవుని మహిమ పర్చారు.అనంతరం కేక్ కట్ చేసి సంతోష గానాలతో దేవుని మహిమ పర్చారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న యూత్ ప్రభంజనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం.శ్రీనివాస్
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న యూత్ ప్రభంజనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండూర్ తెదేపా నేత పార్లమెంట్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పర్యటించారు.శ్రీనివాస్ మాట్లాడుతూ పాస్టర్లకు గ్రామస్తూలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు అడుగుజాడల్లో మనం నడవాలి దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి అని కోరారు.ప్రతి ఒక్కరు ఆత్మీయంగా చింతించాలి.ఆత్మీయ అనుభవం కల్గి ఉండాలని తెలిపారు.మంచి మార్గంలో నడవడానికి యువత ముందుండాలని కోరారు. కొన్ని గ్రామాల్లో యూత్ ప్రభంజనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు బుక్స్,పలుకలు,పెన్సిల్ పంపిణీ చేశారు.చర్చి పెద్దలు యువకులు శ్రీనివాస్ కు సన్మానించారు శ్రీనివాస్ చర్చి పెద్దలకు సన్మానించారు.ఒకరికి ఒకరు ప్రేమతో కేక్ తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మండల్ అధ్యక్షులు కృష్ణ,నరేష్,జగదీష్ గౌడ్,లాయర్ శ్రీశైలం,మాజీ సర్పంచ్ భీంరెడ్డి,కిష్టప్ప,పెద్ద శ్రీశైలం,నాగేష్,నర్సింలు,సందీప్ యువకులు తదితరులు పాల్కొన్నారు.