Type Here to Get Search Results !

Sports Ad

పదో తరగతి పరీక్ష ఫీజుతో దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలలు Exploiting schools with 10th class exam fees

 

పదో తరగతి పరీక్ష ఫీజుతో  దోపిడీకి  పాల్పడుతున్న పాఠశాలలు

- పదో తరగతి పరీక్ష ఫీజుతో  దోపిడీకి  పాల్పడుతున్నరు
- అటువంటి పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
- పిడిఎస్యు(PDSU) జిల్లా అధ్యక్షులు ఎస్ఎండీ రఫీ
- జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగరాజు 

ఆంధ్ర ప్రదేశ్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ రంగారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.డి. రఫీ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రైవేట్,కార్పొరేట్  పాఠశాల్లలో పదవ తరగతి పరీక్ష  ఫీజు  125 రూపాయలు ఉంటే ప్రైవేటు కార్పొరేటు స్కూళ్లలో విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి 1000 నుండి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు.ఏ ఒక్క పాఠశాల కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వసూలు చేసిన రశీదు కూడా ఇవ్వలేదన్నారు.తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు కర్నూలు జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల తనిఖీలు నిర్వహించి వసూళ్లకు పాల్పడుతున్న పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు కర్నూలు నగర నాయకులు  శివకృష్ణ,విజేంద్ర పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies