బషీరాబాద్ లో ఉచిత కుట్టుశిక్షణ కేంద్రం
- మహిళకు ఉచిత కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
- మహిళలు స్వయంశక్తితో ఎదగాలని
- కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలనేదే నా విజన్
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ కృషితో తాండూరు నియోజకవర్గంలో మహిళల ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంలోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామన్నారు.మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి విరివిగా రుణాలను మంజూరు చేయిస్తూ ఇప్పటికే వారి అభ్యున్నతికి దోహదపడుతున్నానని చెప్పారు.ఇప్పుడు బషీరాబాద్ మండల కేంద్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశానని వెల్లడించారు.
మహిళలు స్వావలంబన దిశగా అడుగులు వేయాలనే ఓ సదాశయంతో ఈ సెంటర్ ను ప్రారంభించానన్నారు.ఈ ప్రాంతంలోని మహిళలు స్వయంశక్తితో ఎదగాలని, కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలనేదే నా విజన్ అని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల,టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రామునాయక్,బషీరాబాద్ ఎంపీటీసీ రేఖాపవన్ ఠాకూర్,ఏఎంసీ వైస్ చైర్మైన్ రవీంధర్ సింగ్ తన్వార్,పీఏసీఎస్ చైర్మైన్ వెంకట్రామిరెడ్డి,టీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాజిరెడ్డి,కో అప్షన్ మెంబర్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.