రైతులకు గుడ్ న్యూస్
- ఈ నెల 28 నుంచి ఖాతాల్లోకి రైతు బంధు సాయం
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం రైతు బంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపింది.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.రైతు బంధు నిధులు,ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి.ఇందుకోసం గాను రూ.7,600/- కోట్లను,రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.