Type Here to Get Search Results !

Sports Ad

త్రాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి Government should solve drinking water problem

 

త్రాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి

తాండూర్ : తాండూరు పరిధిలో 31 వ వార్డులో గత నాలుగు రోజుల నుండి త్రాగునీటి సమస్య ఉండడం వలన ఈ సమస్యను తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ.తాండూర్ నియోజకవర్గ కమిటీ వెంటనే తాండూర్ లో 31 వ వార్డులో వెళ్లి ఆ వార్డు ప్రజలతో నీటి సమస్యను తెలుసుకొని ఈ త్రాగునీటి సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పి.అరుణ్ రాజ్,అంజాద్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అని డిమాండ్ చేశారు.తాండూర్ పరిధిలో ఉన్న నీటి సమస్యను తెలుసుకున్న వెంటనే D.E.E. ఆఫీసర్ గారికి  సమస్య పై  వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు వెంకటయ్య,పరశురాం పరమేష్ సోషల్ మీడియా కన్వీనర్ జై రామ్,ఆ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies