Type Here to Get Search Results !

Sports Ad

చేతగాని ప్రభుత్వం బీజేపీ In Basheerabad

 

 చేతగాని ప్రభుత్వం బీజేపీ  

- ఈడి నోటీసులకు భయపడేది లేదు 
- మోడీ,బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం
- మండల కేంద్రంలో రాస్తారోకో 
- కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులు

బషీరాబాద్ : శనివారం రోజున తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ఈడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బషీరాబాద్ మండల కేంద్రంలో రాస్తారోకో చేసి బిజెపి ప్రభుత్వ మోడీ మరియు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వారి కుట్రలను భగ్నం చేసినందుకు రోహిత్ రెడ్డి గారిపై కక్షపూరితంగా వ్యవహరించి ఈడి ద్వారా నోటీసులు ఇప్పించడం సమంజసం కాదు అని అన్నారు.బండి సంజయ్ ముందే రోహిత్ రెడ్డి గారికి నోటీసులు వస్తాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే బిజెపి ప్రభుత్వం చేతిలో ఈడి మరియు ఐటి సంస్థలు పనిచేయడం సిగ్గుచేటు అని అన్నారు.రోహిత్ రెడ్డి గారికి ఎలాంటి కేసుకు సంబంధం లేని వ్యక్తిగత వ్యాపారాలపై ఆరా తీయడం బిజెపి నాయకులకు మంచిది కాదు అని తెలిపారు.పేద ప్రజలకు మంచి చేయడం చేతగాని బిజెపి నాయకులు ఇలాంటి కుట్రలకు పాల్పడడం మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో  మండల పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్,కో ఆప్షన్ మెంబెర్ రాజాజ్,మండల తెరాస మహిళ సంగం అధ్యక్షురాలు జయమ్మ,పిఎసిఎస్ డైరెక్టర్ అశోక్ గౌతమ్,ఎంపిటిసిలు,బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies