బిజెపి కక్ష సాధింపు చర్యలకు నిరసనగ
బషీరాబాద్ : తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి పై బిజెపి కక్ష సాధింపు చర్యలకు నిరసనగ బషీరాబాద్ లో మండల ప్రజాగ్రహ నిరాహార దీక్ష నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు.నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి ఓటు రూపంలో తగిన గుణపాఠం చెప్పే దిశగా తెలంగాణ ప్రజలు మరియు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.బిజెపి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని తెలిపారు.ఈ యొక్క నిరసన కార్యక్రమాలలో మండల పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి,జిల్లా గ్రంథాయాల అధ్యక్షులు రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్,యూత్ ప్రెసిడెంట్ తాహేర్ బాండ్,మహిళా అధ్యక్షురాలు జయమ్మ,కో ఆప్షన్ నెంబర్ అబ్దుల్ రాజ్జాక్,పిఎసిఎస్ డైరెక్టర్ G.నర్సి రెడ్డి,ఎంపిటిసి లక్ష్మి బాయ్,పిఎసిఎస్ డైరెక్టర్ నవీన్ రెడ్డి,పవన్ ఠాకూర్,సీనియర్ నాయకులు సాయిలు స్వామి,సిద్దార్థ,పిఎసిఎస్ డైరెక్టర్ కృష్ణ,మోహన్,సర్పంచ్ శివ,కోటాప్ప, నర్సిములు,యువ నాయకులు రాజు,జగదీష్,రాజు,షాంసుందర్,గంగాధర్,హరి స్వామి,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.