గుంత బాసుపల్లి గ్రామంలో జిప్సం కెమికల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్
* అనారోగ్యానికి గురి అవుతున్న రైతులు
* జిప్సం కెమికల్ కంపెనీ వలన గ్రామస్థులు ఇబ్బందులు
* బొగ్గుగా వాడే బదులు ఈ పదార్థాలను వాడుతారని
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గుంత బాసుపల్లి గ్రామనికి దగ్గరలో ఉన్న కెమికల్ కంపెనీ నుండి వెలువడే ఘాటైన దుర్వాసనకు ప్రజలు చాల ఇబ్బందిగా బ్రతుకుతున్నారు.గ్రామనికి సమీపంలో ఉన్న జిప్సం కెమికల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.గ్రామస్తులు చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామంలోని వ్యక్తులందరికీ చర్మ వ్యాధులు,శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి.
కెమికల్ తాయారు చేస్తున్న ట్యాంక్
త్రాగు నీరు దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం ధర్నా నిర్వహించిన స్థానికులు కంపనీ లోపలికి వెళ్లి పరిశీలించారు.విషపూరితమైన పదార్థాలను,ముడి పదార్థాలను ఉపయోగించి సిమెంట్ కంపినీలలో యంత్రాలను రన్ చేయడం కోసం బొగ్గుగా వాడే బదులు ఈ పదార్థాలను వాడుతారని నిర్వహకులు తెలిపారు.వెంటనే జిప్సం కెమికల్ కంపెనీని తొలగించాలని డిమాండ్ చేశారు.లేకపోతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాలలో సర్పంచ్ జగదీష్,మాజీ సర్పంచ్ ఇస్మాయిల్,గ్రామస్థులు తదితరులు పాల్కొన్నారు.