మద్దిశెట్టి సామేలు గారికి అరుదైన గౌరవం
భద్రాద్రి కొత్తగూడెం : గాయత్రి ఎక్సలెన్స్ అవార్డ్ 2022 తో సత్కరించిన గాయత్రి చారిటబుల్ ట్రస్టు.మద్దిశెట్టి సామేలు గారికి అరుదైన గౌరవం లభించింది.ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్ జిల్లాలకు సంబందించి మద్దిశెట్టి సామేలు గారి సేవలను గుర్తించిన గాయత్రి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాయత్రి ఎక్సలెన్స్ అవార్డ్ 2022 తో సత్కరించడం జరిగింది.వారికి 4 జిల్లాల ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
రేపు మీడియా సమావేశం ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం గ్రామంలోని లక్ష్యా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ది.22.12.2022 నాడు అనగా రేపు మధ్యాహ్నం 12.00 లకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆర్పీఐ (ఏ) పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ శ్రీ పేరం శివ నాగేశ్వరావు,ఆర్పీఐ (ఏ) పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు దిశగాని సంపత్ గౌడ్, బీసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్ హజరవనున్నారు.అదే విధంగా అన్ని మండలాలకు సంబంధించి మండల అధ్యక్షులు,మండల సెక్రెటరీలు,జిల్లా అధ్యక్షులు, జిల్లా సెక్రెటరీలు,రాష్ట్ర కమిటీ టీమ్ మాత్రమే హాజరు కావాలని కోరారు.కావున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ కూడా హాజరై మీడియా సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.