తాండూరులో వెట్టిచాకిరి చేయిస్తున్న హాస్టల్ వార్డెన్
- ఉపాధ్యాయులు దేవుళ్లు కాదు రక్షేసులు
- వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాధికారుల మొద్దు నిద్ర
- హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ సవితి ప్రేమ
- చదుకోవడానికి పంపిస్తే చాకలి పని చేయిస్తారా
- PDSU వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి
- పట్టించుకోని విద్యాధికారులు
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల వెనుకాల ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న గిరిజన బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాండూర్ పట్టణం సాయిపూర్ ప్రభుత్వ నంబర్ 1 పాఠశాల వెనకాల ఉన్నటువంటి గిరిజన బాలికల వసతి గృహంలో దాదాపు రెండు సంవత్సరాల నుండి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయిస్తూ, రెండు మూడో తరగతి చదువుతున్న చిన్నారి గిరిజన బాలికలతో మూడంతస్తుల వరకు ఉన్న భవనం పైకి బకెట్లతో నీళ్లను మోపిస్తూ,మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తూ ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసిస్తున్న గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి చేయిస్తూన్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని విద్యార్థినిలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన హాస్టల్ విద్యార్థినిలు మాట్లాడుతూ హాస్టల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయించడమే కాకుండా, హాస్టల్ ఆవరణలో పెరుగుతున్న గడ్డిని సైతం తమతో తీయిస్తున్నారని, మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రం చేయిస్తూ, అదేమిటి ఎందుకు అని అడుగుతే మమ్మల్ని కొడుతున్నారంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటటూ తమ ఆవేదనవ్యక్తం చేశారు.