బాలికల పాఠశాలను సందర్శించిన జిలాని,ఎస్.దత్తాత్రేయ
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయి పూర్ లో గల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు.నిన్న గిరిజన ఆశ్రమ అమ్మాయిల హాస్టల్లో విద్యార్థుల చేత నాన్ టీచింగ్ స్టాఫ్ హాస్టల్ యొక్క పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ పేపర్ లో వచ్చిన కథనానికి స్పందించి.ఈరోజు భారత రాష్ట్ర సమితి(TRSV)విద్యార్థి విభాగం తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జిలాని జిల్లా అధికార ప్రతినిధి ఎస్.దత్తాత్రేయతో కలిసి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.విద్యార్థులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇస్తున్నారా లేదా అనే విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.