Type Here to Get Search Results !

Sports Ad

బీజేపీ పార్టీలో అందరు సుద్దపూసలేనా ? బీఆర్ఎస్ నాయకులు In Tandur

 

నిరసన సెగలు...బీజేపీ పై భగ్గుమన్న తాండూర్ ప్రజలు

- బీజేపీ పార్టీలో అందరు సుద్దపూసలేనా 
- బిజెపి ప్రభుత్వం కుట్రను బట్టబయలు చేసినందకా ?
- తాండూర్ బీఆర్ఎస్ నాయకులు
- వినాశ కాలకే విపరీత బుద్ధి 
- మీ అహంకారమైన పాలనకు నిదర్శనం ఈడి,ఐటి,సిబిఐ 

తాండూర్ : గౌతాపూర్ లో హోరెత్తిన నిరసన సెగలు గత రెండు రోజులుగా గౌరవ తాండూరు ఎమ్మెల్యే యువ నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి గారికి పైన కారణం లేకుండా ఈడి నోటీసులు ఇచ్చి వ్యక్తిగత విషయాలను అడుగుతూ బిజెపి ప్రభుత్వం ఏదైతే వేధింపు చర్యలకు పాల్పడుతున్నదొ దానిపైన వ్యతిరేకంగా యావత్ తాండూరు మండలం భారత్ రాష్ట్ర సమితి పార్టీ పూర్తిగా ఖండించింది ఈ సందర్భంగా పలువురు నాయకులూ మాట్లాడుతూఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై ఏ కారణం లేకుండా ఎందుకు ED నోటీసు జారీ చేశారు బిజెపి ప్రభుత్వం కుట్రను బట్టబయలు చేసినందకా ?.మీ అహంకారమైన పాలనకు నిదర్శనం ఈడి,ఐటి,సిబిఐ లాంటి సంస్థలను మీ స్వార్థాల కోసం వాడుకుంటూ వేట కుక్కల్లాగా వీటిని ప్రత్యర్థి పార్టీ ప్రజా ప్రతినిధుల మీదికి ఉసి కొల్పుతున్నరు.ఎందుకు మీ పార్టీలో అందరు సుద్దపూసలేనా ?అని ప్రశ్నించారు.

రాజులు రాజ్యాలు కనుమరుగైనై మీరెంత మీ అహంకారపూరితమైన పాలన ఎంత మీకు రోజులు దగ్గర పడ్డాయి.వినాశ కాలకే విపరీత బుద్ధి ప్రజాక్షేత్రంలో మీరు ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమైంది అని అన్నారు.ఎమ్మెల్యేలపై డబ్బు ఎర కేసు  దృష్టి మరల్చడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పైన వ్యక్తిగతమైన ఎజెండాతో ఇబ్బందులకు గురిచేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వాన్ని తాండూరు మండల ప్రజలు పూర్తిగా ద్వేషిస్తున్నారు.దాడులు చేసేది ఉంటే గతంలో ఎందుకు చేయలేదు.ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

కుటుంబ రాజకీయ నేపథ్యం లేకున్నా ఏ గాడ్ ఫాదర్ లేక్కున్న సొంతంగా కష్టపడి ఎవరు ఎన్ని ఇబ్బందులు గురిచేసిన ఎంతో శ్రమతో పట్టుదలతో ఈ స్థాయికి వచ్చిండు రోహిత్ అన్న ఇంతటి మహా నాయకుడిని కాపాడుకునే బాధ్యత మా ప్రజలపై ఉన్నదని వారు అన్నారు.రాజకీయ లబ్ధి కోసం అమ్ముడుపోతే వందల కోట్లు వస్తుండే కానీ తాండూర్ ప్రాంతం ఎన్నడూ అభివృద్ధికి నోచుకోకుండే అని నమ్మి ఎంతో తెగువ చూపించి వారి కుట్రను బట్టబయలు చేసిన నాయకుడు రోహిత్ రెడ్డి అని ఈ విషయం యావత్ తాండూర్ ప్రజలు గుర్తించాలని వారన్నారు.అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజసౌమ్యన్ని అపహస్యం చేస్తే తాండూర్ నీళ్ళు తాగిన బిడ్డలేవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు రాందాస్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

నిరసన కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమా శంకర్ మరియు వికారాబాద్ జిల్లా ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామ్ లింగారెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు,సీనియర్ నాయకులు సిరిగిర్ పేట్ శేఖర్,చెంగోల్ వేణు గౌడ్,మల్కపుర్ రఘునాథ్ రెడ్డి, చేనిగెస్ పూర్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, తాండూరు మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోవింద్,చిట్టి ఘనపూర్ సర్పంచ్ వెంకట రాములు గౌడ్, అయినెల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, కోతలపుర్ సర్పంచ్ సాయిలు,ఎల్మకన్నే సర్పంచ్ జగదీష్, గుంతబాస్ పల్లి సర్పంచ్ జగదీష్, చంద్రవంచ సర్పంచ్ విజయ కుమార్.

ఎంపీటీసీ శివకుమార్,మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్,మండల బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మరియు యువజన విభాగం అధ్యక్షులు రాజు గౌడ్,సీనియర్ నాయకులు యాదప్పా,కోతి గోపాల్, ఉప సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు హుస్సేన్ పటేల్,మండల నాయకులు పలు గ్రామ ప్రజలు అలాగే బిఆర్ఎస్ పార్టీ అభిమానులు రోహిత్ అన్న యువ సైన్యం సభ్యులు ప్రజాబంధు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies