పద్మావతి ఎక్స్ప్రెస్ తాండూర్ లో ఆపాలి
- పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో
- రైల్వే స్టేషన్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు
తాండూర్ : తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో ప్యాసింజర్స్ అమ్యూనిటీస్ ( సౌకర్యాలు) మెంబర్స్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింద. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జిలాని మాట్లాడుతూ తాండూర్ రైల్వే స్టేషన్లో సౌకర్యాలు కల్పించాలని గుంటూరు నుండి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేపల్లె ప్యాసింజర్ మరియు హైదరాబాద్ నుండి ఎంఎంటీఎస్ ను తాండూర్ కు పొడిగించాలని కోరారు.పద్మావతి ఎక్స్ప్రెస్ తాండూర్ లో ఆపాలని కోణార్క్ రైలు వికారాబాద్లో ఆపాలని విజ్ఞప్తి చేశారు.ప్రతిరోజు తాండూర్ నుండి వేలమంది రైలు మార్గం ద్వారా పయనిస్తూ ఉంటారని కావున మీరు దయచేసి ఈ సమస్యలను పరిష్కరించాలని తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం తాండూర్ నియోజకవర్గ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధులు భాను పవర్,వెంకటేష్ గౌడ్,నరేందర్ సింగ్,ఠాకూర్,వెంకట్ యాదవ్,మల్లు యాదవ్,నరేష్,ప్రశాంత్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.