ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా మహా దీక్ష
- మహాజన సోషలిస్టు పార్టీ MSP
- MRPS జాతీయ అధ్యక్షులు మహాజన నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపుమేరకు
యాలాల్ : యాలాల్ మండలం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా మహా దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్పి(MSP) పార్టీ తాండూర్ నియోజకవర్గం ఇన్చార్జి పెద్దోళ్ల ఆనంద్ కుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.గతంలో బిజెపి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి.నేటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతున్న వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
ఒకవేళ బిల్లు పెట్టలేని పక్షంలో బిజెపి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునేందుకు మాదిగ మాదిగ ఉప కులాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.మాదిగలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని అన్నారు.లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అడుగున అడ్డుకుంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి పార్టీ యాలాల్ మండల ఇన్చార్జి పసుల వెంకటయ్య ముదిరాజ్ ఎంఎస్పి తాండూర్ మండల ఇంచార్జ్ పి.నరసింహులు,ఎంఎస్పి తాండూర్ పట్టణ నాయకులు డాక్టర్ శ్రీకాంత్,ఎంఎస్పి యాలాల్ మండల కో ఇన్చార్జిలు కె.నర్సింలు,డి.మహేందర్,టి.మైసయ్య,డి.నర్సింలు,ఎం.కృష్ణ శ్రీనివాస్,నర్సింలు,బాజరప్ప,అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.