రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరణ
- కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అతవాలే
ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాందాస్ అతవాలే గారి చేతుల మీదుగా ఢిల్లీలో సోమవారం రోజు నేషనల్ కౌన్సిల్ మెంబర్ పెరం నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఆర్పిఐ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.అదే విధంగా ఫిబ్రవరి మూడో తారీకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ప్రోగ్రాంకి హాజరుకావాలని ఈ రోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఫిబ్రవరి మూడో తారీకు జరిగే రవీంద్రభారతిలో జరిగే ఆర్పీఐ పార్టీ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ.ఈ కార్యక్రమంలో పేరం నాగేశ్వరావు నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్,తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ దిశగానీ సంపత్ గౌడ్, బీసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,వారితోపాటు అనేక రాష్ట్రాల ఆర్పిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.