యేసు క్రీస్తు ప్రేమమయుడు... ఇతరులకు ప్రేమ పంచాలి
* ప్రతి ఒక్కరికీ ప్రేమ,శాంతి పంచడమే క్రిస్మస్ విశిష్టత
* ఏసుక్రీస్తు అందరికీ అందరికీ ఆదర్శం
* క్రైస్తవ సోదరసోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
* యేసు క్రీస్తు అడుగులు శాంతి మార్గములు
* మనం ఇతరులకు ప్రేమ పంచాలి
* ప్రతి ఒక్కరు ఆత్మీయమైన ఆలోచన కల్గి ఉండాలి
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు.అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. సర్వమతాల సమ్మేళనం సిద్ధాంతాలకు పెద్దపీట వేసే మన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఆదివారం తాండురులోని జీపీఆర్ గార్డెన్స్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవ సోదరసోదరీమణులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ముందుగా నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.ఈ సమావేశంలో పాల్గొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆ మహనీయుని చూపిన ప్రేమ,శాంతి మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దామని సూచించారు.రెండు వేల సంవత్సరాల క్రితం ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టి మానవాళి రక్షణార్థం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన క్రీస్తును స్మరించుకుందాం నిత్యం పూజించుకుందాం అన్నారు.
కొన్ని దుష్ట శక్తులు,విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని కులాల వారీగా మతాల వారీగా విభజించాలి.చూసే ఈ సమయంలో క్రీస్తు యేసు చూపించిన శాంతి మార్గం ఆవశ్యకత ఎంతో ఉందని.మనమందరం కలిసికట్టుగా సమాజంలో శాంతి నెలకొనే ప్రయత్నం చేద్దాం ఐక్యమత్యంగా ఉందామన్నారు.చీకటి నుంచి వెలుగు, అశాంతి నుంచి శాంతి,అసత్యం నుంచి సత్యం వైపు నడిపించిన ఏసుక్రీస్తు అందరికీ అందరికీ ఆదర్శమని.ప్రతి ఒక్కరికీ ప్రేమ, శాంతి పంచడమే క్రిస్మస్ విశిష్టత అని ఈ సందర్భంగా ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డిగారు తెలిపారు.ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ వేడుకను ఈ సాయంకాలానా ఘనంగా జరుపుకున్నందుకు మీరు పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి బేతల్ మినిస్ట్రీస్ పీటర్ సామియెల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.కే.జనర్దాన్,ఏసురత్నం,భాస్కర్,అశోక్, స్టీవెన్ సతీష్,డేవిడ్ సన్నీ,సారంగ విజయ్ కుమార్,ఎప్నేజర్ తో పాటు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు మరియు పలు పాస్టర్లు విశ్వసులు తదితరులు పాల్గొన్నారు.