Type Here to Get Search Results !

Sports Ad

గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ KG to PG

 

గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ 

- తెలంగాణలో మారుతున్న విద్యారంగానికి ప్రతీక
- గంభీరావుపేటలో అన్ని వసతులతో ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ
- మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో మొదటి సరిగా ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.అన్ని జిల్లాల్లో సకల వసతులతో కేజీ నుంచి పీజీ విద్యా వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం ట్విటర్‌లో తెలిపారు.మన ఊరు-మన బడి పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసించేందుకు వీలుగా అన్ని రకాల వసతులతో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తెలంగాణలో మారుతున్న విద్యా రంగాన్ని మీకు పరిచయం చేస్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు.దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌కు జత చేశారు.అంగన్‌వాడీ కేంద్రం,ప్రీ ప్రైమరీ స్కూల్‌,ప్రైమరీ స్కూల్‌,హైస్కూల్‌,జూనియర్‌ కాలేజీ,డిగ్రీ కాలేజీలను ఆరు ఎకరాల్లో నిర్మించామన్నారు.ఈ విద్యాలయంలో 3,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని,తెలుగు,ఆంగ్ల,ఉర్దూ మీడియంలో పాఠాలను బోధిస్తున్నారని చెప్పారు.90 తరగతి గదులతో పాటు కంప్యూటర్‌,సైన్స్‌ ల్యాబ్‌లు,నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం.వెయ్యి మంది విద్యార్థులకు సరిపడా భోజన శాల ఉంది.ఫిఫా ప్రమాణాలతో కలిగిన ఆస్ట్రోటర్ఫ్‌ మైదానాన్ని 44 వేల చదరపు అడుగుల్లో నిర్మించాం.ఫుట్‌బాల్‌,క్రికెట్‌,వాలీబాల్‌,కబడ్డీతో పాటు అథ్లెటిక్స్‌కు సంబంధించిన స్టేడియాలను కూడా ఏర్పాటు చేశాం అని తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies