రోడ్డు పనులను పరిశీలిస్తున్న నాయకులు
తాండూర్ : ప్రారంభమైన 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి జినుగుర్తి నుండి తట్టేపల్లి వరకు బిటి రోడ్ పనులు.ఇట్టి పనులను మండల (బి.ఆర్.ఎస్) భారత్ రాష్ట్ర సమితి తాండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ రాందాస్ గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాశంకర్ మరియు రైతు బంధు అధ్యక్షులు రామలింగారెడ్డి మాట్లాడుతూ దాదాపు 23 కోట్ల రూపాయలతోని ప్రారంభమైనటువంటి జింగుర్తు తట్టేపల్లి రోడ్డు పనుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోనటువంటి రోడ్డునీ గౌరవ తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారి ప్రత్యేక శ్రద్ధతో గతంలో మాటిచ్చినటువంటి విధంగా బ్రహ్మాండంగా నాణ్యతతో ఈ రోడ్డు పనులను చేపడుతున్నందుకు ఎమ్మెల్యే రోహిత్ అన్న కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒక పది పదిహేను రోజుల్లో బీ.టీ.పనులు పూర్తి అయి ప్రయాణ బాధలు తప్పుతాయని చెప్పి వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ రాందాస్ గారు సీనియర్ నాయకులు ఉమాశంకర్ రైతుబంధు అధ్యక్షులు రామలింగారెడ్డి, గౌతాపూర్ ఎంపీటీసీ సాయి రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాకేష్,మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్,మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ హుస్సేన్ పటేల్,గుండ్లమడుగు తండా ఉపసర్పంచ్ రాథోడ్,అరుణ్ కుమార్,జినుగుర్తి ఎంపీటీసీ తనయుడు గంగుపవర్ తదితరులు పాల్గొన్నారు.