అజయ్ పై దాడిని ఖండించిన మద్దిశెట్టి సామేలు
- మద్దిశెట్టి అజయ్ పై దాడిని ఖండించిన ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు
ఖమ్మం : సోమవారం రోజున ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నేను భాద్యతలు తీసుకున్నందుకు గాను నా తమ్ముడు అజయ్ అభినందనలు తెలియజేయటానికి ఖమ్మం నుండి సరోజనపురం వస్తున్న క్రమంలో కొణిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దం పగలగొట్టి కత్తులతో మెడ మీద,గుండె మీద గాయం చేశారు.అజయ్ బాబు గారి అనుచరుడు మీద కూడా దాడి చేశారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉంది.ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ,ఏదైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో మరియు ఖమ్మం కమిషనర్ గారు ఫిర్యాదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నాము.అర్థరాత్రి 12 గంటలకు ఈ విషయం తెలియగానే స్పందించిన 200 మంది బిఎస్ఎస్ఎం కార్యకర్తలకు,బీసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షులు పెరుగు వెంకట రమణ యాదవ్,తదితరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.