రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ గా మద్దిశెట్టి సామేలు
భద్రాద్రి కొత్తగూడెం : ఆదివారం రోజున రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటి నియామకాలు జరిగాయి.గౌరవనీయులు శ్రీ రాందాస్ అథవాలె,కేంద్ర మంత్రివర్యులు సామాజిక న్యాయ శాఖ మరియు సాధికారత మరియు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అథవాలె) జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు మద్దిశెట్టి సామేలు గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటి అధ్యక్షులుగా,తెలంగాణ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులుగా దిశగాని సంపత్ గౌడ్ లను నియమించడమైనది.ఆదివారం రోజున హైదరాబద్ లో నియామక పత్రాన్ని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్ శ్రీ పేరం నాగేశ్వరావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎండీ.ఫయాజ్,అస్లామ్,ఏపీ బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వర్శ వెంకన్న,జిల్లా కార్యదర్శి యట్టి శ్రీరాములు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి,కూసుమంచి మండల అధ్యక్షులు బాణోత్ రవి,ఇల్లందు మండల అధ్యక్షులు ఈసం రవి,జిల్లా నాయకులు కిన్నెర రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.