ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి క్రీడా సమ్మేళనం
తాండూర్ : యాలాల మండల కేంద్రంలో ప్రారంభమైన క్రీడా మహోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్కొన్నారు.పూవ్వుల వర్షంతో ఘన స్వాగతం పలికిన క్రీడాకారులు.జాతీయ గీతాలాపనతో మరియు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేశారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని మరియు శరీరాన్ని దృఢంగా ఉంచుతుందని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడలకు ప్రాధాన్యయాలని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా యాలాల మండలంలో మండల స్థాయి క్రీడలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
క్రీడా కార్యక్రమానికి పూనుకున్న గౌరవ ప్రజా ప్రతినిధులకు ఎంపీడీవో గారికి ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మూడు రోజులుగా జరిగే ఈ క్రీడ మహోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అతిథిలుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,ఎంపీపీ,వైస్ ఎంపీపీ,మండల అధ్యక్షులు వికారాబాద్ జిల్లా కోఆప్షన్ నెంబర్ సభ్యులు,పెద్దముల్ మండల్ ఎంపీపీ మరియు తాండూర్ పట్టణ అధ్యక్షులు నయుమ్ అప్పు మండల ఎంపిటిసిలు సర్పంచులు పలు విభాగాల నాయకులు ప్రజా ప్రతినిధులు యువ నాయకులు మరియు ఉపాధ్యాయులు పీటీలు విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు.