'ఏనుగు ఎక్కి అసెంబ్లీకి పోతాం ' మైనారిటీ యువత బీఎస్పీలో చేరికలు
- గ్రామ గ్రామాన నీలి జెండా పాతుతం
- జహీరాబాద్ పట్టణంలో యువకులు బీఎస్పీలో చేరికలు
- రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సిద్దు రావణ్
జహీరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ జహీరాబాద్ పార్టీ కార్యాలయంలో పలు కాలనీలకు చెందిన పట్టణ మైనారిటీ యువకులు కాంగ్రెస్,టిఆర్ఎస్ ఇతర పార్టీల నుండి బీఎస్పీ పార్టీలోకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధూ రావణ్ నీలి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీ లో చేరిన వారు అతిక్ ముజామిన్ ఎండి గౌసోదిన్ ఇబ్రహీం ఆదిల్ ఆది తదితరులు ఈ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలన్న రైతులకు న్యాయం జరగాలన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నా కేవలం బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో సాధ్యమని పెద్ద ఎత్తున యువకులు చేరుతున్నారు.రాబోయే రోజులలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నీలి జెండా ఎగరేస్తాం ప్రతి గుండెను తడతాం ఎట్టి పరిస్థితుల్లో ఏనుగెక్కి వెళ్ళేది ఖాయమని ప్రకటించాడు.ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు నాయకులు జిల్లా ఇంఛార్జి బాబు రావు,జుబేర్,యాబా అబ్దుల్లా,ముబీన్ యాదగిరి,మహేష్ కురుమ,నరేష్ ముదిరాజ్ తదితరాలు పాల్గోన్నారు.