క్రిస్టియన్ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వనమా
- 30 లక్షల రూపాయల నిధులతో సెంట్ ఆండ్రూస్ చర్చి
- సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం : శుక్రవారం రోజున పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం సెంట్ ఆండ్రూస్ చర్చ్ లో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సమాధులకు వెళ్ళు సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని.ఏసుక్రీస్తు కృప వల్ల అందరు సంతోషంగా ఉండాలని,ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమతాలకతీతంగా తను ముందుండి పని చేస్తానని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,మున్సిపల్ కమిషనర్ రఘు,టిపిఒ ప్రభాకర్,మేనేజర్ సత్యనారాయణ,కౌన్సిలర్లు పల్లపు లక్ష్మణ్,కోలాపురి ధర్మరాజు,రుక్మందర్ బండారి,పరమేష్ యాదవ్,వేముల ప్రసాద్,సుజాత,పాస్టర్ కెఎన్ భూషణం,బిఆర్ఎస్ నాయకులు ఎంఏ.రజాక్,మసూద్,దుర్గ,కుసపాటి శ్రీను,మధుసూదన్ రావు,బొంకూరు పరమేష్,కుమారస్వామి,చర్చి కమిటీ జాన్ రవీందర్ కుమార్,సల్మాన్ రాజ్,అల్లి ప్రకాష్,ప్రభు చందర్,హిజాక్,క్లైమేట్,జాన్సన్,జీసస్ కుమార్,గ్రేస్ మేరీ,కవిత మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,క్రిస్టియన్ సోదరులు,సోదరీమణులు పాల్గొన్నారు.
పేదలకు వరం సిఎం రిలీఫ్ ఫండ్
ఈ రోజు పాత పాల్వంచ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొత్తగూడెం,పాల్వంచ,సుజాతనగర్,లక్ష్మీదేవి పల్లి,చుంచుపల్లి మండలాలకు చెందిన 26 మంది పేదలకు సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం కలిపి 15 లక్షల 52 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగ ఉంటుందని అర్హత కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.