మినీ థియేటర్, బిర్యానీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా
- ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వాలి
- తాటికొండ భరత్ ఆధ్వర్యంలో
పాల్వంచ : పాత పాల్వంచ రిలయన్స్ బంక్ ప్రక్కన నూతనంగా నిర్మించిన సెవెన్ స్టార్ సినిమాస్ 100 సీట్లు గల మినీ థియేటర్ను మరియు బిర్యానీ రెస్టారెంట్ ను గురువారం కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మినీ థియేటర్ పాల్వంచ ప్రేక్షకులను అలరించనున్నది.పాల్వంచకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ తాటికొండ అప్పారావు కుమారుడు తాటికొండ భరత్ ఆధ్వర్యంలో చేపట్టారు.సరికొత్త హంగులతో నూతనంగా ఏర్పాటైన మినీ థియేటర్ ప్రేక్షకులకు ఆహ్లాదానుభూతిని ఇవ్వాలని వనమా అన్నారు.బిర్యానీ రెస్టారెంట్ క్వాలిటీ పరంగా ఉండి ప్రజలకు సరసమైన ధరలకు లభించాలన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,ప్రముఖ కాంట్రాక్టర్ మెక్ వెంకటేశ్వరరావు, బోడేపూడి చిన్న,పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం,డాక్టర్ సుధాకర్,ఎర్రగుంట సాంబశివరావు,కనగాల బాలకృష్ణ,చల్లగుండ్ల వీరభద్రం,నగేష్ అయ్యగారు తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకల్లో పాల్కొన్న వనమా
కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు పలు శుభకార్యాలలో పాల్కొన్నారు. ప్రముఖ ఛానల్ ఎన్ హెచ్ 9 అధినేత ముత్తినేని కుమారుడి వివాహం పాల్కొని నవదంపతులు ఆశీర్వదించారు.అనంతరం పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీ నివాసి ప్రముఖ అడ్వకేట్ సూరసాని విజయభాస్కర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.మరియు బాపూజీ నగర్ కొమర్రాజుల విజయ్ (పాల విజయ్) మేనకోడలు వివాహ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో పాల్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, డైరెక్టర్ ఎస్విఆర్కే ఆచార్యులు తదితరులు పాల్కొన్నారు.