క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ
- క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రోజున అంబేద్కర్ భవన్ లో కొత్తగూడెం పట్టణం,చుంచుపల్లి,సుజాతనగర్, లక్ష్మీదేవి పల్లి మండలంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ గిఫ్ట్ లను క్రైస్తవ సోదరీ సోదరీమణులకు తన చేతుల మీదుగా అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఏసుక్రీస్తు దయవల్ల అందరూ చల్లగా ఉండాలని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,ఎంపిపి బుక్య సోనా,మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సంజీవరావు,ఎంఆర్ఓ లు రామకృష్ణ,నాగరాజు,కృష్ణ ప్రసాద్,కౌన్సిలర్లు వేముల ప్రసాద్, కోలాపూరి ధర్మరాజు,అంబుల వేణు,సత్యనారాయణ చారి,బిఆర్ఎస్ నాయకులు ఎంఏ.రజాక్,కేకే శ్రీను,ఎస్.మధుసూదన్ రావు,పూర్ణ,పిల్లి కుమార్,కాజా,మున్నా,ఈశ్వర్,ఖాళీ,చర్చ్ పాస్టర్లు దేవదాస్,స్వీఆర్ పాల్,థామస్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,క్రైస్తవ సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.