సాధన చేస్తే... సాధ్యం కానిదంటూ... ఏది లేదు
- విద్యార్థులో దాగివున్న ప్రతిభను గుర్తించాలి
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- విద్యాశాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి
- జడ్పీ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని బుధవారం నాడు జిల్లా స్థాయి 50వ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండగా విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వికారాబాద్ మునిసిపాలిటి పరిధిలోని కొత్తగడిలో గల TSWREIS బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిర్వహించిన,జిల్లా స్థాయి 50వ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.మారుమూలన ఉన్న విద్యార్థుల్లోనూ భవిష్యత్తు సైన్ టిస్టులు దాగి ఉన్నారన్నారు.విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలని,అలాంటి వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.విజ్ఞాన ప్రదర్శనలతో అవకాశం కల్పిస్తే మట్టిలో నుండి మాణిక్యాలను గుర్తించవచ్చని,విద్యార్థి దశ నుండే ఏదైన సమస్యలు ఎదురైతే గద్దలా ఎదిరించాలని,అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన స్థాయిలో విద్యార్థులు నిలవాలన్నారు.విద్యార్థులు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి,విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.