కేసీఆర్ ప్రధాని కావాలని పాదయాత్ర
- పోలీసులు ఇద్దర్ని అరెస్ట్
- వారిని విడిపించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు
జోగులాంబ : అలంపూర్ నియోజకవర్గం చెందిన అయిజా మండలం వెంకటాపురం గ్రామం నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దేశ ప్రధానమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్నారు.వాళ్లు పేర్లు కొమ్మవారి ప్రసాద్, దయగల చంద్రశేఖర్ మరియు వారి సహచరులు నాగరాజు, ప్రదీప్ వీళ్లు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పర్మిషన్ లేదని లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ సాయిచంద్ వెంటనే స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి వారిని విడిపించారు.