బిజెపి యిచ్ఛిన మాట నిలబెట్టుకోవాలి
- ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్ట బద్దత కల్పించాలి
- ఎమ్మార్పియేస్ జాతీయ ప్రధానకార్యదర్శి కోళ్ల శివ మాదిగ
బషీరాబాద్ : బషీరాబాద్ మండల ఎంఎస్పి ఇంఛార్జీ బి.కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏమ్మార్పియెస్ మండల సమావేశాన్ని బషీరాబాద్ మండలంలోనీ ఎమ్మార్పీఎస్ ఆఫీస్ లో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి కోళ్ల శివ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.బిజెపి కేంద్రంలో అధికారంలోకి వొస్తే వంద రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అని అన్నారు.ప్రజలు వేతిరేకించిన బిల్లులను అఘమెగలమీద ఆమోదించిన బిజెపి 28సం" రాలుగా మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం దుర్మార్గమన్నారు.ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సభాలకు సమావేశాలకు దీక్షలకు గల్లినుంచి ఢిల్లీ దాకా అనేక వేదికలమీదా మాట్లాడిన బిజెపి జాతీయ రాష్ట్ర నాయకులు.
పార్లమెంట్ ఎందుకు బిల్లు పెట్టట్లేదని ఆయన అన్నారు.ఇపుడు జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన మాదిగల ఆగ్రహానికి బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ఇంచార్జి పి.ఆనంద్ మాదిగ,ఎంఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ,ఎంఎస్ఎస్ బషీరాబాద్ మండల ఇంఛార్జి ప్రకాష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పి.రాములు మాదిగ,శేకర్,నర్సింలు,అనుతెస్ సంజీవ్, కములప్ప,గోపి, రాములు,విజయ్ కుమార్,నవీన్,నర్సప్ప,బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.