సకాలంలో బస్సులు నడపాలని వినతి పత్రం
తాండూర్ : తాండూర్ పబ్లిక్ వాయిస్ ఆధ్వర్యంలో తాండూర్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ తాండూర్ నుండి కొడంగల్ మార్గంలో వెళ్లే మిత్ర నగర్ అయ్యప్ప నగర్ గ్రీన్ సిటీ రెడ్డి కాలనీ మరియు హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టీఎస్ ఆర్టిసి బస్సు రిక్వెస్ట్ స్టాప్ ను ఏర్పాటు చేసి బస్సు ఆపాలని అదేవిధంగా సమయాన్నికూలంగా బస్సులు నడపాలని తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫారం ద్వారా డిఎం గారికి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మిత్రానగర్ గ్రీన్ సిటీ ప్రజలు మరియు ప్రభుత్వ విద్యార్థులు పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధులు జిలాని, భాను, పవర్, వెంకటేష్ గౌడ్,హనుమంతు,న్యాయవాది జె.ప్రకాష్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షులు మాజర్ శ్రీను,రాజు తదితరులు పాల్గొన్నారు.