వికారాబాద్ లో గుట్టల మధ్య ఇరుకపోయిన ఆర్టీసీ బస్సు
- ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరులో మార్పు లేదు
- పట్టించుకోని ఆర్టీసీ ప్రభుత్వం
వికారాబాద్ : ఆర్టీసీ బస్సులో సురక్షితం అని అంటారు డిపో మేనేజర్లు మరియు ప్రభుత్వ అధికారులు కానీ బస్సులు కండిషన్ లో ఉందా లేదా చెక్ చేయడం లేదా ? అని ప్రజలు ప్రశ్నింస్తున్నారు.వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెంబర్ AP 28 Z 1589 అనంతగిరి కొండల మధ్యలో ఆగిపోయింది.ప్రయాణికులకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.ప్రయాణికులను కిందకు దింపి తర్వాత ఇంజన్ హీట్ కావడంతో నీళ్లు పోశారు.బస్సును కొండ పైకి ఎక్కించుకొని,దిగిన ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని వెళ్లారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా, కండిషన్ ఉన్న బస్సులను అనంతగిరి రూట్లో వేయాలని మూడు రోజుల క్రితం ఎస్పీ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ విషయం చర్చ జరిగినా కానీ ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.ప్రజలు ఆర్టీసి బస్సులలో ప్రయాణించడానికి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.