ఇందర్చేడ్ గ్రామంలో కానిస్టేబుల్ కాళ్ల పై నుండి వెళ్లిన ఇసుక ట్రాక్టర్
- అధికారులకు లొంగని ఇసుక మాఫియా
- పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్
- గాలిస్తున్న పోలీస్ సిబ్బంది
- Cr no : 139/2022 U/sec 307 IPC OF PS BASHEERABAD
బషీరాబాద్ : ఇసుక మాఫియా వలన కానిస్టేబుల్ కాళ్ల పై నుండి వెళ్లిన ఇసుక ట్రాక్టర్.దారుణమైన ఘటన బషీరాబాద్ మండలంలో ఇందర్చేడ్ గ్రామంలో చేటు చేసుకుంది.నిన్న అనగా తేది : 19.12.2022 నాడు రాత్రి 09:00 గంటల సమయంలో ఎస్ఎచ్ఓ బషిరాబాద్ గారి ఆదేశాల మేరకు బి.శంకర్ PC 6576 మరియు శివరాం HG 284లు ఇద్దరు కలిసి రాత్రి బ్లూకోట్ విధులు నిర్వహించుకుంటూ ఇంద్రచేడ్ గ్రామానికి వెళ్ళినారు.అప్పుడు సమయం అందాజ రాత్రి 10:50 గంటల సమయంలో బి.శంకర్ మరియు శివరాం లు ఇంద్రచేడ్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిలబడి యుండగా అక్కడికి ఒక ఇసుక ట్రాక్టర్ No: KA 32 TB 5597 గల ట్రాక్టర్ ట్రాలి నిండా ఇసుకతో అక్కడికి రాగా బి.శంకర్ మరియు శివరాంలు అట్టి ట్రాక్టర్ ను ఆపి ఇసుకను ఎక్కడి నుండి తరలిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్ ను అడుగగా.అందుకు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడి నుండి తెస్తే మీకు ఎందుకురా అంటూ భూతులు పలికాడు.
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
మీరు అడ్డు వస్తే మిమ్మల్ని ట్రాక్టర్ తో గుద్ది చంపుతా అని తన యొక్క ట్రాక్టర్ ను అతివేగంగా బి.శంకర్,శివరాంల పైకి తీసుకుని రాగా బి.శంకర్ మరియు శివరాం లు ప్రక్కకు తప్పుకునేలోపు. ట్రాక్టర్ డ్రైవర్ బి.శంకర్ కు టక్కరు ఇవ్వగా(ఢీ కొట్టడంతో) శంకర్ క్రింద పడిపోగా ట్రాక్టర్ డ్రైవర్ తన ట్రాక్టర్ ను కానిస్టేబుల్ శంకర్ కాళ్ళ పై నుండి తీసుకుని వెళ్ళగా శంకర్ రెండు కాళ్ళకు బలమైన రక్త గాయాలు అయ్యాయి.ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుండి తన ట్రాక్టర్ ను అతివేగంగా నడుపుకుంటు వెళ్ళి ఇంద్రచేడ్ గ్రామ శివారులోని కల్వర్టుకు ఢీకొనగా ప్రక్కన గల పొలాలో తన ట్రాక్టర్ బోల్తా పడగా అట్టి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయినాడు.ఇట్టి సమాచారం తెలుసుకున్న ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి మరియు సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని శంకర్ ను చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తరలించి చికిత్స చేయించుచున్నారు. మరియు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇట్టి ఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది.