Type Here to Get Search Results !

Sports Ad

బుద్ది గడ్డి తిన్న సర్పంచ్...భోజనం దగ్గర దాడి Sarpanch Attack near meal



బుద్ది గడ్డి తిన్న సర్పంచ్...భోజనం దగ్గర దాడి

- అధికారం ఉన్నది అని ధీమా 
- సర్పంచ్ దళితుడి పై చెప్పుతో దాడి
- సర్పంచ్ పై కేసు నమోదు 

క్రైమ్ : దళితుల పై సర్పంచ్ మహిళా దాడి చేసి చెప్పుతో కొట్టి దాడి చేసిన ఘటన బాజా కుంట గ్రామంలో చేటుచేసుకుంది.నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజా కుంట గ్రామంలో దళితుల పై సర్పంచ్ మహిళా దాడి చేసి చెప్పుతో కొట్టింది.గ్రామస్థులు తెలిపిన ప్రకారం ఈ నెల 4 తేదీన రోజున ఒకరి ఇంట్లో దేవత పండుగ చేయడంతో కులవృత్తిలో భాగంగా డప్పులు కుట్టేందుకు దళితులు వెళ్లారు.పండుగ అయిపోయాక భోజనం చేయడానికి వెళ్లారు.అదే సమయానికి గ్రామ సర్పంచ్ సరిత భర్త రవీందర్ రెడ్డి భోజనం చేస్తున్నారు.సర్పంచ్ మరియు వారి కులస్థులు దళితులకు మేము తిన్నాక మీరు తినండి అని చెప్పారు.అలాగే అని దళితులు ఒక గంట అయ్యాక తిరిగి వచ్చారు.అప్పటివరకు ఇంకా భోజనం పూర్తికాలేదు.

అప్పుడే వస్తారా అని రవీందర్ రెడ్డి,ఇంద్ర రెడ్డి దళితుల పై కోపం దాడి చేశారు.దీంతో దళితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రోజున గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పెద్దల సమక్షంలో ఈ కేసు విషయం పై మాట్లాడుతిండగా సర్పంచ్ సరిత మా పై కేసు పెడ్తారా అంటూ దళిత వికలాంగుడి పరుశురాం పై చెప్పుతో దాడి చేసింది.దీంతో ప్రజా సమితి మరియు ప్రజా నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ సరిత మరియు ఆమె భర్త పై కేసు నమోదు చేయాలంటూ మరియు అధికారం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క కార్యక్రమాలలో గ్రామస్థులు ప్రజా నాయకులు తదితరులు పాల్కొన్నారు. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies