పాము కాటుకు గురైనా పాఠశాల విద్యార్థిని
రంగారెడ్డి : షాద్ నగర్ నియోజకవర్గం చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షిత పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది.టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థినికి పాము మూడు కాట్లు వేయడంతో అక్షిత ప్రమాదాని గురికావడంతో తోటి విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.ఆ పాఠశాలలో పరిశుభ్రత లేదని టాయిలెట్లు చెత్తతో నిండిపోవడంతో దుర్గంధం,దుర్వాసనగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స నిమిత్తం అక్షితను హాస్పత్రికి తరలించారు.