ఏక్మాయి గ్రామంలో సెమీ క్రిస్టమస్ కి అందరూ ఆహ్వానితులే
- ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
- పలు సంఘ కాపరులు హాజరుకానున్నారు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో రేపు అనగా తేది : 09-12-2022 సమయం సాయంత్రం 05:00 గంటలకు గ్రామ విశ్వస క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రార్ధన మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు విచ్చేయనున్నారు.పాస్టర్లు డిఎస్ జనార్ధన్,మార్క్,స్వర్ణ లతా రవిబాబు,స్టీఫెన్,నెహెమ్యా మరియు చంద్ర మౌళి పలు సంఘ కాపరులు హాజరుకానున్నారు.ఈ యొక్క సమావేశానికి వచ్చి దేవుని దీవెనలు పొందగలరు.