చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు మంచిది
తాండూర్ రూరల్ : తాండూర్ పట్టణంలో చంద్రవంచ యూత్ ఫోర్స్ కబడ్డి పోటీలను ఉమా అన్న ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించిన కరణ్ కోట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఐ) మధుసూదన్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు కబడ్డీ పోటీలు దోహదపడతాయని మరియు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు ఉమాశంకర్,చంద్రవంచ సర్పంచ్ శ్రీదేవి విజయకుమార్,చిట్టి ఘనపూర్ సర్పంచ్ మంజువాణి వెంకటరాములు గౌడ్ పంచాయతీ సెక్రెటరీ బాలు గౌడ్ చంద్రవంచ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ మహిళలకు చీరల పంపిణి
- క్రిస్మస్ పండగ సందర్భంగా చీరల పంపిణి
- బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్ ఆధ్వర్యంలో
తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో సర్పంచ్ మల్లేశ్వరి శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నేడు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి అధ్యక్షతన గ్రామ మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది.సాగర్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సర్వ మతాలను ఒకేలా చూసే గొప్ప నాయకుడు అని కొనియాడారు.అలాగే గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేయాలని ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో మహిళల పాత్ర అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు,గెలుపుకు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో విద్యాసాగర్ గౌడ్,మరియు గ్రామ సర్పంచ్, చర్చి యొక్క ఫాదర్, మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు,అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా మహిళలకు ఇచ్చినటువంటి చీరలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.