ఇంటర్నేషనల్ ఛాంపియన్ లో పాల్కొననున్న తాండూర్ ఆణిముత్యాలు
- 28న బెంగళూర్ లో తైక్వొండో ఏఒటి కప్ 3వ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్
- పాల్గొననున్న తాండూర్ క్రీడాకారులను
- ఆశీర్వదించిన టివి5 జర్నలిస్ట్ గోపాల్
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ కి చెందిన 20మంది క్రీడాకారులు కర్నాటక స్టేట్ బెంగళూర్ లో మాస్టర్ మనోహర్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 28,29వ తేదీన తైక్వొండో ఏఒ టి కప్ 3వ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ నిర్వహించారు. ఈ నేపధ్యంలో సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శివమ్ గ్రామర్ స్కూల్ లో ఇంటర్ నేషనల్ ఛాంపియన్ షిప్ కు వెళ్లే క్రీడాకారులకు టీవీ 5 తాండూర్ జర్నలిస్ట్ గోపాల్ ప్రతి ఒక్క క్రీడాకారుని పరిచయం చేసుకుని క్రీడాకారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా జర్నలిస్ట్ గోపాల్ మాట్లాడుతూ బెంగుళూరులో నిర్వహించే ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో వికారాబాద్ జిల్లా తాండూర్ కి చెందిన క్రీడాకారులు రాణించి జిల్లా,రాష్ట్రంతో పాటు దేశానికి,ముఖ్యంగా తల్లి తండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకంక్షించారు.ఈ కార్యక్రమంలో తైక్వొండో మాస్టర్ కుసాల్,రాంరెడ్డి,జర్నలిస్ట్ నర్సింహ,శ్రీ కౌసల్య,నొమాన్,వివేక్,సొహేల్,గౌతమ్,హరిణిక,రైజొ కుమార్,మణికంఠ,సంత్ర కుమారి,తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.