విధ్యార్ధుల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడేది టీచర్
- అంగన్ వాడి టీచర్లు ఆదర్శంగా ఉండాలి
-ఏఐఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా
తాండూర్ : తాండూర్ పట్టణ పరిధిలోని మాణిక్నగర్ అంగన్వాడి టీచర్ వసంత మాల బదిలీ కావడంతో ఆమె స్థానంలో జుంటుపల్లి స్వాతి నియమితులయ్యారు.ఈ సంధర్బంగా ఏఐఎంఐఎం కౌన్సిలర్ వార్డ్ No 14 పిఏ బొంబీనా మరియు సూపర్వైజర్ నిర్మల హాజరై బదిలీ అవుతున్న వసంత మాలకు వీడ్కోలు పలికి,నూతనంగా నియమించిన జుంటుపల్లి స్వాతి గారికి స్వాగతం పలికి శాల్వ పూవ్వులమాలతో సన్మానించారు.ఏఐఎంఐఎం కౌన్సిలర్ పిఏ బొంబీనా మాట్లాడుతూ ఎల్లప్పుడూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.చిన్నారులకు,గర్భిణులకు,అంగన్ వాడి టీచర్లకు సేవలందించి ఆదర్శంగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయురాలు అంగన్వాడి సంధ్యా గౌడ్,శాంతమ్మ ఆయా,వార్డు మహిళలు మరియు పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.