టికెట్ నాకే తాండూర్ నుండి నేనే నిలబడుతున్న
- కేసీఅర్,కేటీఆర్, నాకే టికెట్ ఇస్తారు
- కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు
- మీకు అండగా ఉంటా
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకుడిని పట్నం మహేందర్ రెడ్డి
పేద్దేములు : పేద్దేములు మండలంలో ఆదివారం రోజున కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు,మీకు అండగా నేను ఉంటా టికెట్ నాకే వస్తుంది.రాజకీయంలో నాయకులు వస్తుంటారు పోతుంటారు కావున ఇలాంటివి పట్టించుకోకుండా ఇప్పటి నుంచి కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.అలాగే జనవరి నుంచి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమం మెదలు పెడతామని.ప్రజలలో సమస్యలను పరిష్కారం చేస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేద్దేములు నాయకులు మాజీ సర్పంచ్ ఏర్ర బలప్ప.
అంజీల్ రెడ్డి,డి.వై నర్సింహులు,అంజయ కుమార్,మహిపాల్ రెడ్డి,ఇందుర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇందుర్ ప్రకాశం,ముషేనప్ప,సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి,అజిం,అరుణ్,శ్రీకాంత్,అన్వర్,హిషక్,ఎంపిటిసి శ్రీను,మాజీ సర్పంచ్ ప్రకాష్,వెంకటయ్య,మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య,హర్ష వర్ధన్ రెడ్డి,మదనంత పూర్ ఉప సర్పంచ్ శ్రీను,లక్ష్మణ్,తదితర నాయకులు వార్డ్ నాయకులు,తాండూర్ నాయకులు సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు,మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత రెడ్డి,గౌడి వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహా సభ
- తాండూర్ టౌన్ లో టీఎస్టియుయాప్ జిల్లా మహా సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ
- ఎమ్మెల్సీ గారికి స్వాగతం పలికిన టీఎస్టియుయాప్ నాయకులు
తాండూర్ : ఆదివారం రోజున తాండూర్ టౌన్ లోని పొట్లి మహరాజ్ టెంపుల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) 4వ జిల్లా మహా సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్కొన్నారు.ఈ సంధర్బంగా మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టీచర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది.గ్రామీణ ప్రాంతాలలో కూడా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.అలాగే మొన్న జరిగిన రోడ్డు ఆక్సిడెంట్ టీచర్స్ చనిపోవడం జరిగింది.గనుక వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు.
ఎమ్మెల్సీ గారికి టీఎస్టియుయాప్ మేమోటం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు,టీఎస్టియుయాప్ రాష్ట్ర నాయకులు జంగాయ్య,తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు,మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,జడ్పీటిసి మంజుల వెంకటేష్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు మరెపల్లి బల్వాంత్ రెడ్డి,సర్పంచ్ పాండు,వెంకటేష్,శ్రీకాంత్ రెడ్డి,హస్నొద్దిన్,మాజార్,టీఎస్టియుయాప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.