ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
వికారాబాద్ : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.అదే గ్రామానికి చెందిన పట్నం మల్లయ్య ట్రాక్టర్ డ్రైవర్.గురువారం రోజున కూడా ట్రాక్టర్ వర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా ట్రాక్టర్ నడిపే పనికి వెళ్ళాడు.మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో పొలంలో దున్నుతుండగా ఆకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తా పడి మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి పోస్ట్మాటర్న్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.