మంత్రి కేటీఆర్ మామ పార్థివదేహానికి నివాళులు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబంలో విషాదం.మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో కనుమూశారు.మంగళవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ హరినాధరావు బుధవారం రాత్రి 8:30 గంటలకు మృతి చెందాడు.ఆయన పార్థివదేహానికి మంత్రి కేటీఆర్,మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పోలీస్ శాఖ మంత్రి వర్యులు మైముద్ అలి,ఎమ్మెల్సీ శంబిపుర్ రాజు,కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,అరికెపుడి గాంధీ,సతీష్ రెడ్డి తదితరులు నాయకులు,నివాళులు అర్పించారు.