తాండూరు నియోజకవర్గ TRSV అధ్యక్షుడిగా జోగుల ఎబినేజర్ నియామకం
* నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు : బుధవారం రోజున రాత్రి తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు పట్టణానికి చెందిన జోగుల ఎబినేజర్ ను టిఆర్ఎస్వి (TRSV) తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని నూతనంగా ఎన్నికైన TRSV అధ్యక్షుడు ఎబినేజర్ కు సూచించారు.TRSV నియోజకవర్గ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ,వారి సమస్యలను ఎప్పటికపుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తామన్నారు.అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,మరియు నాయకులు నూతనంగా ఎన్నికైన జోగుల ఎబినేజర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అధికార ప్రతినిధిగా పి.వెంకట్ రెడ్డి
తాండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పి.వెంకట్ రెడ్డి నియామకం అయ్యారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియామక పత్రం అందించారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే తాండూర్ నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని నియోజకవర్గ ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తానని చెప్పడం జరిగింది.అలాగే టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.