బ్రోకర్ మురళీకృష్ణ దద్దమ్మ...బట్టలు ఊడదీసి కొడతాం
- భూ కబ్జా లిక్కర్ బ్రోకర్ మురళీకృష్ణ
- దళితుల పట్ల అసభ్యంగా మాట్లాడితే తాండూర్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొడతాం
- దౌర్జన్యాలు అత్యాచారాలు హింసలు చేస్తున్న పార్టీ బిజెపి
- బిజెపి పార్టీ చేస్తున్న విధానం ఏమిటంటే
- ద్వేషం విధ్వంసం రెచ్చగొట్టడం
- అరే మురళి కృష్ణ దద్దమ్మ తెలియకపోతే తెలుసుకో
- బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు ఆగ్రహం
పెద్దేముల్ : తాండూర్ నియోజకవర్గంలో పెద్దేముల్ బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.భూ కబ్జా లిక్కర్ దందా చేసే దద్దమ్మ మురళీకృష్ణ గౌడ్.దళితుల పట్ల అసభ్యంగా మాట్లాడితే తాండూర్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొడతామని బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం పెద్దేముల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డివై.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి మామిండ్ల వెంకటయ్య.అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటయ్య ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యువజన సంఘం సభ్యులు అనిల్ కుమార్,రమేష్,దస్తప్ప,సుదర్శన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.మంగళవారం యాలాల్ మండల కోకట్ గ్రామంలో ఓ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ ముల్లి కృష్ణ గౌడ్ దళిత జాతిని అవమానపరిచే విధంగా ఒక చాటలో తవుడు పోసి కెసిఆర్ కుక్కలను ఎగబెట్టాడని మాట్లాడిన తీరును ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో రాష్ట్రాలలో దళితులపై దౌర్జన్యాలు,హింసలు చేస్తున్న పార్టీ బిజెపి.ఆ పార్టీలో దళితులు ఎలా చేర్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం చేస్తున్న విధానం ఏమిటంటే ద్వేషం,విధ్వంసం రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతుందని చేశారు.బిఆర్ఎస్ పార్టీలో 2013-14 సంవత్సరంలోనే దళిత యువకులు అధిక సంఖ్యలో ఉన్నారని గుర్తు చేశారు. బిడ్డ మురళీకృష్ణ గౌడ్ దళితుల పట్ల ఎక్కడైనా అవమానంగా కిర్చపరిచే విధంగా మాట్లాడితే వెంటబడి తరిమి తరిమి కొట్టి నీపై అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.